Bihar: లుంగీ కట్టుకుని, కనీసం చొక్కా కూడా వేసుకోకుండా కత్తితో పాఠశాలకు వెళ్ళి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. టీచర్ను బెదిరించి రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిహార్లోని అరారియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వివరాలు తెలిపారు. జోకిహాట్ బ్లాక్ పరిధిలోని భగవాన్పూర్ పంచాయతీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి తన పిల్లలు చదివే పాఠశాల సమీపంలోనే నివసిస్తుంటాడు.
Andhra Pradesh: ఎట్టకేలకు ఇళ్ళకు చేరిన మచిలీపట్నం మత్స్యకారులు
తాజాగా, తన పిల్లలు చదువుతున్న పాఠశాలకు కత్తితో వెళ్ళాడు. తన పిల్లలకు పాఠశాల నుంచి రావాల్సిన పుస్తకాలు, యూనిఫాం అందలేదని, వాటిని బదులుగా తనకు డబ్బులు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే కత్తితో పొడిచి చంపేస్తానని హెచ్చరించాడు. చివరకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు పదే పదే ఇటువంటి బెదిరింపులకే పాల్పడుతుంటాడని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.