Porsche Car : లగ్జరీ పోర్స్చే కారుతో బైకును ఢీకొట్టిన మైనర్.. ఇద్దరు దుర్మరణం
పోలీసుల కథనం ప్రకారం.. కళ్యాణి నగర్లో తెల్లవారుజామున 3.15 గంటలకు అనీష్ అవడియా, అశ్విని కోస్టా క్లబ్లో పార్టీ చేసుకుని స్నేహితులతో కలిసి బైకుపై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
- Sreehari A
- Published On : May 19, 2024 / 05:48 PM IST
Speeding Porsche Car ( Image Credit : Google )
Porsche Car : పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ మైనర్ నడిపిన లగ్జరీ పోర్షే కారు మోటార్సైకిల్పై ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. కళ్యాణి నగర్లో తెల్లవారుజామున 3.15 గంటలకు అనీష్ అవడియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు యువకులు క్లబ్లో పార్టీ చేసుకుని స్నేహితులతో కలిసి బైకుపై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కళ్యాణి నగర్ జంక్షన్ వద్ద పోర్షే టైకాన్ కారును నడుపుతున్న వేదాంత్ అగర్వాల్ (17) వేగంగా వెళ్తున్న వారి బైక్ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో వారిద్దరూ గాలిలోకి ఎగిరి మరో కారుపై ల్యాండ్ అయ్యారు. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైకును ఢీకొట్టిన కారు పేవ్మెంట్పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. స్థానికులు డ్రైవర్ను పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. నిందితుడు వేదాంత్ ఎరవాడ పోలీస్ స్టేషన్లో 279 (ర్యాష్ డ్రైవింగ్), 304A, 337, 338, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు చేశారు.
