Chatrapathi Remake : బెల్లం బాబుకి నలుగురూ ‘నో’ చెప్పేశారు..

క్నీషియన్స్ విషయం పక్కన పెడితే పాపం బాలీవుడ్‌లో బెల్లం బాబుకి హీరోయిన్స్ దొరకడం లేదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కథానాయికలు బెల్లంకొండ పక్కన నటించడాని నో చెప్పేశారు..

Chatrapathi Remake: ఇటీవల ‘రాక్షసుడు’ మూవీతో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతి లాల్ గడా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. టెక్నీషియన్స్ విషయం పక్కన పెడితే పాపం బాలీవుడ్‌లో బెల్లం బాబుకి హీరోయిన్స్ దొరకడం లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కథానాయికలు బెల్లంకొండ పక్కన నటించడాని నో చెప్పేశారు.

అనన్య పాండే, దిశా పటాని, కియారా అద్వాణీ, శ్రద్ధా కపూర్ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ నలుగురూ తెలుగులో సినిమాలు చేశారు. పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ ‘లోఫర్’ మూవీతో దిశా టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయింది. కియారా ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’, శ్రద్ధా, రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ సినిమాల్లో నటించినవారే.. ఇక అనన్యా పాండేను పూరి ‘లైగర్’ మూవీతో పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్ నుండి ఓ హీరో, దర్శకుడు హిందీ చిత్ర సీమలో అడుగు పెడుతుంటే నో చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుంది అంటూ ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు