Mangalhat PS: హైదరాబాద్‌లో చిన్నారిపై అత్యాచారయత్నం

మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో 9 ఏళ్ల  చిన్నారిపై అత్యాచారయత్నం చేయబోయాడు ఓ కామాంధుడు. స్థానికులు వెంటనే అలర్ట్ కావడంతో బాలికను రక్షించారు. నిందితుడు పరార్ అయ్యాడు.

Rape Attempt : సైదాబాద్ సింగరిణి కాలనీలో చిన్నారి హత్యాచార ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు రాజును ఇంకా పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటన ఇంకా మరువక ముందే..మరో దారుణం చోటు చేసుకుంది. మంగళ్ హాట్ పీఎస్ పరిధిలో 9 ఏళ్ల  చిన్నారిపై అత్యాచారయత్నం చేయబోయాడు ఓ కామాంధుడు. స్థానికులు వెంటనే అలర్ట్ కావడంతో బాలికను రక్షించారు. నిందితుడు పరార్ అయ్యాడు.

Read More : Stock Market : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

హబీబ్ నగర్ లోని మంగారుబస్తీలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేయబోయాడు ఓ యువకుడు. ఖాళీగా ఉన్న దుకాణంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అక్కడనే ఉన్న స్థానికులు గమనించి..బాలికను రక్షించారు. నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. లంగర్ హౌస్ లోని అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More : Ola electric Sales: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల సేల్ మొదలైందోచ్.. బుకింగ్ గైడ్ ఇదిగో!

మరోవైపు..సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు రాజు ఇంకా దొరకడం లేదు. చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజును పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పట్టిస్తే 10 లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన పోలీసులు.. రాజు ఎలా ఉంటాడో ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం జుట్టుతో ఉన్న రాజు గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడో కూడా ఫోటోలు విడుదల చేశారు. హైదరాబాద్ వాసులే కాకుండా.. ఇతర జిల్లాల ప్రజలు కూడా రాజును గుర్తుపట్టేలా బస్సులపై పోస్టర్లు అంటిస్తున్నారు. ఫోటోలు పట్టుకుని ఇతన్ని ఎక్కడైనా చూశారా అంటూ అరా తీస్తున్నారు. ఎవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే.. ఆచూకీ చెప్పాలంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు