Mogilaiah : ‘భీమ్లా నాయక్’ సినిమాలో ‘లా లా భీమ్లా’ అనే టైటిల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ పాటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు కిన్నెర మొగిలయ్య. ఈ పాట తర్వాత మొగిలయ్య కూడా పాపులర్ అయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మొగిలయ్యకి పద్మశ్రీ అవార్డు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో మరోసారి వార్తల్లో నిలిచారు మొగిలయ్య. ఇక కేంద్రం పద్మశ్రీ అవార్డ్యూ ప్రకటించడంతో తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా మొగిలయ్యకి ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయలు ప్రకటించారు.
దీంతో మొగిలయ్య ప్రస్తుతం రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా వాళ్ళు మొగిలయ్యకి ఇప్పుడు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని, ప్రమోషన్ గా వాడుకోవాలని చూస్తున్నారు. మొగిలయ్యకి అవార్డు వచ్చినప్పుడు కూడా చాలా మంది సినిమా ప్రముఖులు మొగిలయ్యకి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. ఇప్పుడు మొగిలయ్యకి సినీ పరిశ్రమ నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది.
Kapil Sharma : తప్ప తాగి షారుఖ్ ఇంటికి వెళ్ళాను.. పిలవని పార్టీకి వెళ్లడంతో..
తాజాగా సినీ వర్గాల సమాచారం మొగిలయ్యకి జూ.ఎన్టీఆర్ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చిందని సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. ఈ సినిమాలో మొగిలయ్యతో ఒక పాట పాడించాలని చిత్ర బృందం అనుకున్నారని సమాచారం. పాటల రికార్డింగ్ సమయంలో, పాటలు రాసే సమయంలో మొగిలయ్యతో మాట్లాడాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే మరో మంచి పాట వచ్చినట్టే. మొగిలయ్యకి కూడా వరుస అవకాశాలు దక్కినట్టే.