PM Modi : ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 25 వరకు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్య సమిత సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు.

Modi US tour : ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 25 వరకు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్య సమిత సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు. కరోనా, తీవ్రవాదం అంశాలను ఆయన ఐక్య రాజ్య సమితిలో ప్రస్తావిస్తారు. అంతే కాకుండా.. అప్ఘానిస్తాన్ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఆ దేశం పట్ల మన వైఖరిని మోడీ ప్రకటించే అవకాశం ఉంది.

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపైనా చర్చించే అవకాశం ఉంది. యూఎన్‌లో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి కూడా మోడీ ప్రస్తావిస్తారు. ఈ నెల 23న లేదా.. 24వ తేదీల్లో అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌తో మోడీ సమావేశమయ్యే అవకాశం ఉంది. 2019 తర్వాత నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. క్వాడ్‌ కాన్ఫరెన్స్‌కు ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు