Ram Charan: ముంబై థియేటర్లో చెర్రీ.. ప్రేక్షకులకు సడెన్ సర్పైజ్!

మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా నేషనల్ మార్కెట్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలను నేషనల్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా.. మూవీ ప్రమోషన్స్ కూడా అదే..

Ram Charan: మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా నేషనల్ మార్కెట్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలను నేషనల్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా.. మూవీ ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేసి సినిమాకి మార్కెట్ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాది మీద ఫోకస్ పెట్టిన దక్షణాది హీరోలు.. అక్కడ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు చిన్న చిన్న పట్టణాలలో కూడా ఈవెంట్స్, మీడియా ఇంట్రాక్షన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. పుష్ప నుండి ఆర్ఆర్ఆర్ వరకు రాబోయే కేజీఎఫ్ 2 సినిమాకు అదే స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పని చేసిన వారికి బంగారం బహుమతిగా ఇచ్చిన చరణ్

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారి ఇప్పుడు రాబోయే సినిమాలతో ఆ బ్రాండ్ మరింత పదిలం చేసుకొనేందుకు అన్ని విధాలుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తండ్రి మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్య సినిమాను కూడా బాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న చరణ్.. తాజాగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రదర్శించే ముంబైలోని థియేటర్లో సడెన్ సర్ప్రైస్ ఇచ్చాడు. బాంద్రాలోని గైటీ థియేటర్‌ని సందర్శించి అక్కడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

Ram Charan: ఆచార్య కోసం సిద్ధ మొదలుపెట్టాడు!

అప్పటి వరకు స్క్రీన్ మీద అల్లూరిగా కనిపించిన హీరో సడెన్ గా ప్రేక్షకుల మధ్యకి రావడంతో వాళ్ళ ఆనందనానికి అవధులు లేకుండా పోయాయి. చెర్రీ ఆకస్మిక పర్యటనతో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. సినిమా గురించి ప్రేక్షకులతో మాట్లాడిన చరణ్ వారితో కూల్‌గా ఇంటరాక్ట్ అవడం అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిన మెల్లగా మౌత్ టాక్ తో పుంజుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పటికే వంద కోట్లు దాటి రెండు వందల కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తుంది.

ట్రెండింగ్ వార్తలు