Mahesh Babu : నాన్న నిన్ను గర్వపడేలా చేస్తా అంటున్న సితార

ఇన్ని రోజులు సోషల్ మీడియా, యూట్యూబ్ లో అందర్నీ అలరించిన సితార ఇప్పుడు మొదటి సారి తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుని వెండితెరపై కూడా మెప్పించనుంది ఈ సినిమాతో.......

 

Sithara Ghattamaneni :  సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాని మే 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, కళావతి సాంగ్ బాగా పాపులర్ అయ్యాయి. కళావతి సాంగ్, అందులో మహేష్ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి కూడా. తాజాగా నిన్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు.

 

పెన్నీ పెన్నీ.. అంటూ ఈ పాట సాగనుంది. ఈ ఫుల్ సాంగ్ ని నేడు(ఆదివారం) విడుదల చేయనున్నారు. నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలో మహేష్ అభిమానులకి, ప్రేక్షకులకి సర్‌ప్రయిజ్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ లో మహేశ్‌ బాబు కూతురు సితార కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి రానున్న సెకండ్ సాంగ్ లో మహేష్ కూతురు సితార కూడా కనిపిస్తుంది.

RRR: ప్రమోషన్స్ జోష్.. గుజరాత్‌లో ల్యాండైన ఆర్ఆర్ఆర్ టీమ్!

ఇన్ని రోజులు సోషల్ మీడియా, యూట్యూబ్ లో అందర్నీ అలరించిన సితార ఇప్పుడు మొదటి సారి తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుని వెండితెరపై కూడా మెప్పించనుంది ఈ సినిమాతో. దీంతో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సితార ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ”పెన్ని సాంగ్‌ కోసం సర్కారు వారి పాట వంటి అద్భుతమైన టీంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాన్న.. నిన్ను గర్వపడేలా చేస్తాను” అంటూ పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు