Ram Charan: ఇందిరా దేవి గారి సంస్మరణ సభకు హాజరైన చరణ్ అండ్ ఉపాసన..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిన్న ఇందిరా దేవి గారి సంస్మరణ దినం నిర్వహించగా.. ఈ కారిక్రమానికి బాలకృష్ణ, అడవి శేషుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే..

Ram Charan: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆమె మృతిపట్ల మహేష్ బాబు అండ్ ఫ్యామిలీకీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సంగతి తెలిసిందే.

Ram Charan Shankar Movie: చరణ్ సినిమాలో మరో స్టార్ యాక్టర్.. ఎవరంటే?

నిన్న ఇందిరా దేవి గారి సంస్మరణ దినం నిర్వహించగా.. ఈ కారిక్రమానికి బాలకృష్ణ, అడవి శేషుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే నేడు రామ్ చరణ్ కూడా మహేష్ బాబు ఇంటికి చేరుకున్నాడు. ఈరోజు సాయంత్రం చరణ్ ఉపాసనతో కలిసి ఇందిరా దేవి గారి సంస్మరణ సభకు హాజరయ్యాడు.

సూపర్ స్టార్ కృష్ణ గారిని, మహేష్ బాబును పరామర్శించి, ఇందిరాదేవి గారికి నివాళులు అర్పించారు చరణ్ అండ్ ఉపాసన. ఇందుకు సంబంధిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.అలాగే ఇందిరాదేవి స్వస్థలం బుర్రిపాలెంలో అక్టోబర్ 16వ తేదీన బంధువులు, ఘట్టమనేని అభిమానుల సమక్షంలో సంతాప సభ నిర్వహించేందుకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు