తప్పు చేస్తే.. జగన్‌ అయినా ప్రశ్నిస్తా- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా. పదవి ఉన్నప్పుడు, లేనప్పుడు జగన్ వెంట నడిచా. ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. అదే చిరునవ్వు.

Posani Krishna Murali : సరిగా పని చేయకపోతే సీఎం జగన్ ని అయినా ప్రశ్నిస్తా అని ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. జగన్ బాగా పని చేస్తాడు, పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉంటాడు.. అందుకే ఆయనంటే నాకు అంత అభిమానం అని పోసాని అన్నారు. అదే సమయంలో ఒకవేళ జగన్ బాగా పని చేయకపోతే మాత్రం కచ్చితంగా తాను ప్రశ్నిస్తానని పోసాని తేల్చి చెప్పారు. సరిగా పని చేయకపోతే ఎవరినైనా అది జగన్ అయినా మరొకరైనా సరే.. నేను క్వశ్చన్ చేస్తాను అని అన్నారు పోసాని. 10టీవీ ఓపెన్ డిబేట్ లో పోసాని కృష్ణమురళి ఈ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు.

”రాజకీయాల్లో 90శాతం మంచి వాళ్లు ఉండరు. ఒకరినొకరు ఎలా తిట్టుకుంటారో అందరికీ తెలుసు. మోదీ, అద్వానీ, వాజ్ పేయి, ఇందిరను కూడా తిట్టిన వారు ఉన్నారు. మోదీ అంటే నాకు ఇష్టం. చాలా నీతిపరుడు. జెన్యూన్ గా ఉంటారు. ఆయనను 35ఏళ్ల నుంచి చూస్తున్నా. చాలా హుందాగా మాట్లాడతారు. అందుకే ఆయనకు నేను అభిమానిని. అలాంటి వారిని లైక్ చేస్తాను.

ఈ లోకంలో పరిపూర్ణ మానవులు ఎవరూ లేరు. ఉన్న వాళ్లలో బెటర్ ఎవరో చూశా. అందులో జగన్ నాకు నచ్చారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చింది డెడికేషన్ కోసం. ప్రజలకు సేవ చేస్తే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారనే విషయం జగన్ కు తెలుసు. నేను కూడా ప్రజల్లో ఒకడినే. జగన్ బాగా చేసినంత కాలం దగ్గరగా ఉంటా. బాగా చేయనప్పుడు పక్కకి వెళ్తా.

Also Read : మీ జగన్.. భూములిచ్చేవాడు.. భూములు లాక్కొనేవాడు కాదు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం

జగన్ 100శాతం డెడికేషన్ మనిషి. ఒకవేళ సరిగా పని చేయకపోతే.. నేను కచ్చితంగా ప్రశ్నిస్తా. బాగా చేస్తే గౌరవిస్తా, లేదంటే ప్రశ్నిస్తా. పార్టీ ఏదైనా ప్రశ్నిస్తా. 14ఏళ్ల నుంచి చూస్తున్నా. జగన్ ఒకేలా ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా. పదవి ఉన్నప్పుడు, లేనప్పుడు జగన్ వెంట నడిచా. ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. అదే చిరునవ్వు. అందుకే నేను ఆయనకు వీరాభిమానిని, భక్తుడిని, సైనికుడిని. జగన్ ఎప్పుడూ ఎవరినీ చీప్ గా మాట్లాడింది లేదు. 14ఏళ్ల నుంచి  ఆయనను చూస్తున్నా. నాకు ఎవరినీ కాకా పట్టాల్సిన అవసరం లేదు” అని జగన్ గురించి తన మనసులో మాట చెప్పారు పోసాని కృష్ణమురళి.

 

ట్రెండింగ్ వార్తలు