Mukesh Ambani : భారత దేశ రెండో సంపన్నుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ దుబాయ్లో మరో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశాడు. ఇటీవలే దుబాయ్లో ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి సంచలనం సృష్టించిన అంబానీ, ఇప్పుడు అంతకంటే రెట్టింపు ధరతో విల్లాను కొనుగోలు చేశారు.
Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన
తాజాగా కొనుగోలు చేసిన ఈ విల్లా ధర 163 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. మన కరెన్సీలో సుమారు రూ.1,354 కోట్ల వరకు ఉంటుంది. కువైట్ సంపన్నుడు మొహమ్మద్ అల్షయాకు చెందిన పామ్ జుమైరా మ్యాన్సన్ను గత వారం ముకేష్ అంబానీ కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్కడి బీచ్ సమీపంలో నిర్మించిన ఈ విల్లా చాలా విలాసవంతమైంది. కొద్ది రోజుల క్రితమే అంబానీ అక్కడి ఖరీదైన రెసిడెన్షియల్ ఏరియాలో రూ.664 కోట్ల విలువైన ఒక విల్లాను కొనుగోలు చేశాడు. ఇప్పుడు కొన్న విల్లా దీనికి రెట్టింపు ధర ఉండటం విశేషం. ముకేష్ ఇటీవల విదేశాల్లో ఆస్తుల కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
అంబానీకి ముగ్గురు పిల్లలు. అందుకే వారి కోసం వేర్వేరుగా విల్లాలు, ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే ఐకానిక్ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్కును రూ.592 కోట్లతో అంబానీ కొన్నాడు. ఇది తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి కేటాయించారు. కుమార్తె ఈశా అంబానీకి న్యూయార్క్లో మరో ఖరీదైన భవనం కోసం వెతుకుతున్నారు. ఇటీవల దుబాయ్లో కొన్న రెండు విల్లాల్ని కూడా తన పిల్లల కోసమే కొన్నట్లు సమాచారం.