Drug test: డ్రగ్స్ (డోప్) టెస్టులో విఫలమైనందున ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన ఒక పైలట్ను విధుల్లోంచి తొలగించినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇలా డ్రగ్స్ టెస్టులో విఫలం కావడం వల్ల పైలట్లను తొలగించడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ముగ్గురు పైలట్లను డీజీసీఏ ఇలాగే తొలగించింది.
Uddhav Thackeray: మరాఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్తో శివసేన పొత్తు.. ప్రకటించిన ఉద్ధవ్ థాక్రే
పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు కూడా డోప్ టెస్టులు నిర్వహించాలని డీజీసీఏ గత జనవరిలో నిర్ణయించింది. అప్పట్నుంచి అనేక మంది సిబ్బందికి డోప్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన డోప్ టెస్టు ఫలితాలు ఈ నెల 23న రాగా, అందులో ఒక పైలట్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అతడిలో ఒక నిషేధిత డ్రగ్కు సంబంధించిన పదార్థాన్ని పరీక్షలో గుర్తించారు. దీంతో అతడ్ని వెంటనే విధుల్లోంచి తొలగించింది. ఆ పైలట్ ఢిల్లీ ఎయిర్పోర్టులో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, మరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధరణ కాగా, అతడ్ని కూడా విధుల్లోంచి తొలగించారు. యూరిన్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షల్ని ర్యాండమ్గా నిర్వహిస్తున్నారు. అంటే.. ఎవరికి, ఎప్పుడు పరీక్ష ఉంటుందో తెలియదు.
Viral video: మొసళ్ల మధ్య నదిలో పడిపోయిన బాలుడు.. ప్రాణభయంతో అరుపులు.. తర్వాత ఏం జరిగిందంటే..
వీలున్నప్పుడు కొందరిని అప్పటికప్పుడు సెలెక్ట్ చేసి, వారి నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సరైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఎవరూ మోసానికి పాల్పడే అవకాశం లేదు. డ్యూటీలో ఉన్నప్పుడు లేదా డ్యూటీ ముగిసిన తర్వాత ఉన్నట్లుండి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారు. అయితే, మొదటిసారి పరీక్షలో పాజిటివ్ వస్తే.. వెంటనే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. అలాగే డి-అడిక్షన్ సెంటర్లకు పంపిస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి రెండోసారి పరీక్ష నిర్వహిస్తున్నారు. అప్పుడు కూడా పాజిటివ్ వస్తే చర్యలు తీసుకుంటున్నారు.