Chandrababu : వైసీపీ ప్రభుత్వం పాలనకు ఈరోజుతో నాలుగేళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాలుగేళ్ల పాలనపై సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ప్రజా వేదిక కూల్చివేతకు అదేశాలు ఇస్తూ ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది అంటూ ట్వీట్ ద్వారా సెటైరిక్ విమర్శలు చేశారు. సీఎంగా జగన్ ఇచ్చిన తొలి ఆదేశాలు….ప్రజా వేదిక కల్చివేత దృశ్యాలు ఉన్న వీడియోతో ట్వీట్ చేసారు చంద్రబాబు నాయుడు.
Yea…what you said on Day One is being followed by you and your Govt with perfection @ysjagan!
AP’s march towards destruction started with this and will continue into its 5th year under your cruel watch. pic.twitter.com/lZGdgQVGMP
— N Chandrababu Naidu (@ncbn) May 30, 2023
కాగా వైసీపీ ప్రభుత్వం పానల నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము ఇచ్చిన హామీలను 98 శాతానికి పైగా నెరవేర్చామని చెబుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ సంతకం చేసి నాలుగేళ్లు అయ్యిందని సజ్జల ప్రశంసించారు.
Chandrababu, satires,YCP’s four year rule,CM Jagan,