CM Jagan : నెల్లూరు వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్ సీరియస్‌

బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదంటూ నేతలకు క్లాస్ తీసుకున్నారు. వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూనే.. ఏమైనా ఇబ్బందులుంటే తనతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు.

CM Jagan serious : నెల్లూరు పంచాయితీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కొన్నాళ్లుగా ఉప్పు నిప్పులా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఇద్దరినీ పిలుపుంచుకున్న జగన్.. వాళ్లిద్దరికీ క్లాస్ తీసుకున్నారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదంటూ నేతలకు క్లాస్ తీసుకున్నారు. వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూనే.. ఏమైనా ఇబ్బందులుంటే తనతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీలో సీనియర్లైన మీరే ఇలా చేస్తే ఎలా అంటూ కాస్త ఘాటుగానే మందలించినట్లు తెలుస్తోంది. అందరూ కలిసి పని చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని కాకాణి, అనిల్‌కు జగన్ సూచించారు.

కొన్నాళ్లుగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కాకాణి, అనిల్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవలే ఒకేరోజు ఇద్దరు కూడా పోటాపోటీగా సభలు నిర్వహించారు. వారి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేసుకునే పరిస్థితి కనిపించింది. దీంతో వారిద్దరిని సీఎం జగన్, క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. సీఎం జగన్ తో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విడి విడిగా సమావేశం అయ్యారు. మొదటగా మాజీ అనిల్ కుమార్, ఆ తర్వాత మంత్రి కాకాణి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఎవరి వర్షన్ వారు సీఎం జగన్ కు చెప్పుకున్నారు.

CM Jagan-Anil Kumar : సీఎం జగన్ తో మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ

కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయినప్పటికీ నుంచి కూడా నెల్లూరు వైసీపీలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని కోడ్ చేస్తూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సహకారం అందించారో అంతకంటే డబుల్ సహకారాన్ని అందిస్తానని వ్యాఖ్యలు చేశారు. దీంతో నెల్లూరు జిల్లాలో కాకాణి, అనిల్ కుమార్ మధ్య విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈనేపథ్యంలో గతవారం రోజులుగా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. కాకాణి వర్గం.. అనిల్ పై, అనిల్ వర్గం..కాకాణి, మిగిలిన నేతలపై వరుసగా విమర్శలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు