Karnataka SSLC Results : కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ అసెస్మెంట్స్ బోర్డ్ (KSEAB) కర్ణాటక SSLC 2024 ఫలితాలను మే 9న (గురువారం) ప్రకటించనుంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు కేఎస్ఈఏబీ అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఎస్ఎస్ఎల్సీ ఫలితాలు (karresults.nic.in) లేదా (kseab.karnataka.gov.in) అధికారిక వెబ్సైట్లలో ఉదయం 10:30 గంటలకు వెలువడనున్నాయి. కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ వాల్యుయేషన్ బోర్డ్, మల్లేశ్వరం, బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఫలితాలు ప్రకటించనుంది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 4.5 లక్షల మంది పురుషులు, 4.3 లక్షల మంది విద్యార్థినులు ఉన్నారు. ఎస్ఎస్ఎల్సీ పరీక్ష మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 మధ్య జరిగింది. జేటీఎస్ విద్యార్థులకు ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు ఏప్రిల్ 8, 2024న నిర్వహించారు.
ఫలితాల కోసం ఇలా చెక చేయండి :
Read Also : Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో సంక్షోభం.. 86 సర్వీసులు రద్దు, ప్రయాణికుల అవస్థలు