Krishna : వరకట్న వేధింపులు.. ఐదు నెలల గర్భిణీ ఉరేసుకుని ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక ఐదు నెలల గర్భవతి అయిన కుసుమలక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.

pregnant woman suicide : వరకట్న వేధింపులు భరించలేక ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణా జిల్లా పెడనలో విషాదం నెలకొంది. వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఇంట్లోనే ఉరి వేసుకుంది. మృతురాలు ఐదు నెలల గర్భవతి కావడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుసుమలక్ష్మి అనే మహిళ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె ఐదు నెలల గర్భవతి.

అయితే కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరకట్నం కోసం కుసుమలక్ష్మిని వేధిస్తోన్నారు. కట్నం కోసం వేధిస్తున్నారని తల్లికి ఫోన్‌ చేసి బాధితురాలు వాపోయింది. వరకట్న వేధింపులు తాళలేక ఐదు నెలల గర్భవతి అయిన కుసుమలక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Dowry Harassment : పెళ్లైన 10 ఏళ్లకు కూడా వరకట్న వేధింపులు ..వివాహిత ఆత్మహత్య

అయితే కూతురును చూసేందుకు ఇంటికి వెళ్లేసరికి కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన గుడ్లవల్లేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు