Jio TV + Jio Tablet : రిలయన్స్ జియో ఫస్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయ్.. ఎప్పుడంటే?

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి ఫస్ట్ స్మార్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయి. వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ సిగ్మంట్లో లాంచ్ కానున్నాయి.

Jio TV + Jio Tablet : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి ఫస్ట్ స్మార్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయి. వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇటీవలే రిలయన్స్ జియో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్ ‘Jio Phone Next’ లాంచ్ చేసింది. ఇప్పుడా అదే ప్రొడక్ట్ పోర్ట్ పోలియోలో మరిన్ని డివైజ్‌లను సరసమైన ధరకే అందించేందుకు జియో ప్లాన్ చేస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఇప్పుడు టీవీ, ట్యాబ్లెట్లపై రిలయన్స్ జియో దృష్టి పెట్టింది. భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ సిగ్మంట్లో ఈ టీవీ, ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన Redmi, Realme, Motorola, Nokia వంటి టీవీ, ట్యాబ్లెట్ పోటీదారు కంపెనీలకు జియో గట్టి పోటీనివ్వనుంది. అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే ఏడాది 2022 భారత మార్కెట్లోకి రిలయన్స్ జియో తమ మొట్టమొదటి జియో టీవీ, జియో ట్యాబ్లెట్ లాంచ్ కానున్నాయి. రాబోయే సంవత్సరంలో ఏయే సమయంలో ఈ రెండు ప్రొడక్టులను లాంచ్ చేయనుందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే వార్షిక ప్రధాన సమావేశంలో మాత్రం రాబోయే తమ ప్రొడక్టులపై రిలయన్స్ జియో ప్రకటించే అవకాశం ఉంది. జియో ఇప్పటివరకూ తమ ఫస్ట్ టెలివిజన్ పేరు ఏంటో కూడా అధికారికంగా ప్రకటించలేదు.

లీకైన సమాచారం ప్రకారం.. Jio TV అని అంటున్నారు. ఇందులో OTT Apps ప్రీలోడెడ్ అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇంతకీ జియో టీవీ Android TV లేదా Google TV అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే గూగుల్.. రిలయన్స్ జియోతో కలిసి PragatiOS కోసం పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ కస్టమైజడ్ వెర్షన్ ఇది. Jio Phone Nextలో కూడా ఇదే ఓఎస్ రన్ అవుతుంది. రాబోయే జియో ఫస్ట్ టీవీ.. jio Fiber Connection బండెల్ తో కలిపి వస్తుందని టాక్. మరోవైపు Jio Tabletలో కూడా PragatiOS సాఫ్ట్ వేర్ ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Online Betting : వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరి అరెస్ట్.. రూ.2 కోట్లు స్వాధీనం

ట్రెండింగ్ వార్తలు