CBI Team Under Attack : ఆన్లైన్లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలే లక్ష్యంగా CBI(కేంద్ర దర్యాప్తు సంస్థ) మంగళవారం దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై సీబీఐ ఈనెల 14న 83 మంది నిందితులపై సీబీఐ 23 కేసులు నమోదు చేసింది. 23 వేర్వేరు కేసులకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ తోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ సహా 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. సుమారు 80 బృందాలు అనుమానిత ప్రాంతాల్లో దాడులు జరిపింది.
అయితే ఈ క్రమంలో ఒడిశాలోని దేనకనాల్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం సీబీఐ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఉదయం నిందితుడి ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన సీబీఐ బృందంపై అతడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు దాడికి దిగారు. కర్రలతో అధికారులపై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సీబీఐ అధికారులను గ్రామం నుంచి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
అయితే, ఈ ఘటనపై స్థానికులు వేరేవిధంగా స్పందిస్తున్నారు. స్థానిక పోలీసులకు తెలియకుండా సీబీఐ బృందం వచ్చిందని వారంటున్నారు. అక్కడికి వచ్చిన సీబీఐ బృందం వారి గుర్తింపును కూడా వెల్లడించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
కాగా,2019లో, సీబీఐ తన ప్రత్యేక క్రైమ్ జోన్ కింద న్యూఢిల్లీలో ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ప్లోయిటేషన్ నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రత్యేక బృందం సేకరిస్తుంది. అనంతరం నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇప్పటివరకు వివిధ కేసుల్లో పలువురు నిందితులను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
ALSO READ Air Quality : వరుసగా నాలుగోరోజు..ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయుకాలుష్యం
#WATCH | Odisha: A CBI team was attacked by locals in a village in Dhenkanal district where it had gone to conduct searches at a man's residence in a case related to online child sexual abuse material
"We've rescued them from the crowd," a police officer at the spot said pic.twitter.com/yuE0J7wVj5
— ANI (@ANI) November 16, 2021