Divorced Woman Ends Her Life : హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీ ఆరవ బ్లాక్లో నివాసముండే ఫాతిమా సుల్తానా(33) అనే మహిళ మూడేళ్ళ క్రితం ఇమ్రాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా అతనితో విడాకులు తీసుకుంది. అనంతరం తల్లితో కలిసి ఉంటూ కోకాపేటలోని ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోంది.
Also Read : Ganja Seized In Sullurpet : నెల్లూరు జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం
ఇటీవల తన స్నేహితురాలి వివాహానికి వెళ్తానని ఫాతిమా, తన తల్లి షాకీరా బేగంని అడగగా అందుకు ఆమె వద్దు అని అభ్యంతరం చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫాతిమా సుల్తానా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.