Communal Violence : హర్యానాలో మత హింస..ముగ్గురి మృతి

హర్యానా రాష్ట్రంలోని నుహ్, గురుగ్రామ్ మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హర్యానాలో నిన్న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు....

Haryana Communal Violence

Communal Violence : హర్యానా రాష్ట్రంలోని నుహ్, గురుగ్రామ్ మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హర్యానాలో నిన్న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. నుహ్ పట్టణంలో మతపరమైన ఊరేగింపును అడ్డుకునేందుకు ఒక గుంపు ప్రయత్నించడం, రాళ్లు రువ్వడం, కార్లకు నిప్పంటించారు. (Communal Violence) దీంతో హోంగార్డులను కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.

Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం…15 మంది మృతి

రాత్రికి రాత్రే జరిగిన హింసలో మూడో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్రను గురుగ్రామ్-అల్వార్ జాతీయ రహదారిపై కొందరు యువకులు అడ్డుకున్నారు. (Haryana Communal Violence) హింస తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలపై గుంపు దాడికి దిగింది. హింస గురుగ్రామ్-సోహ్నా హైవే వరకు వ్యాపించింది. పలు కార్లను తగులబెట్టారు.

Anju-Nasrullah Wedding : అంజూ-నస్రుల్లా వివాహం వెనుక పాక్ ఐఎస్ఐ కుట్ర…మధ్యప్రదేశ్ పోలీసుల విచారణ

ఊరేగింపులో పాల్గొనడానికి నుహ్‌కు వచ్చిన 2,500 మంది హింసాకాండతో ఒక ఆలయంలో చిక్కుకుపోయారు. సాయంత్రం తర్వాత పోలీసులు వారిని రక్షించారు. హింసాత్మక ఘర్షణల తర్వాత నుహ్, గురుగ్రామ్, పాల్వాల్, ఫరీదాబాద్‌లలో నిషేధాజ్ఞలు విధించారు. (Internet Shut) గురుగ్రామ్ ఫరీదాబాద్ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను మంగళవారం మూసివేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అభ్యంతరకర వీడియోతో ఘర్షణ తలెత్తిందని నివేదికలు చెబుతున్నాయి. శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు