బాబోయ్.. పోలీసును కర్రతో దారుణంగా కొట్టిన వ్యక్తి, ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

కానిస్టేబుల్ పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Attack On Police (Photo Credit : Google)

Attack On Police : తిరుపతి జిల్లా గూడూరులో షాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ పై దాడి జరిగింది. ఓ వ్యక్తి కర్రతో పోలీస్ ను దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు పోలీసులు బైక్ పై ఓ షాప్ దగ్గరికి వచ్చారు. ముందుగా కానిస్టేబుల్ బైక్ దిగి.. షాప్ బయట నిల్చుని ఉన్నాడు. ఇంతలో దారుణం జరిగిపోయింది. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కర్రతో ఆ కానిస్టేబుల్ పై సడెన్ గా దాడి చేశాడు. చాలా బలంగా కర్రతో కానిస్టేబుల్ ను కొట్టాడు. దాంతో ఆ కానిస్టేబుల్ కింద పడిపోయాడు.

కానిస్టేబుల్ కిందపడిపోయినా ఆ వ్యక్తి కోపం చల్లారలేదు. మళ్లీ అతడిపై దాడి చేశాడు. కర్రలో పలుమార్లు కొట్టబోయాడు. ఇంతలో అలర్ట్ అయిన మరో పోలీసు పరిగెత్తుకుని వచ్చి.. ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకున్నాడు. స్థానికులు కూడా వచ్చి ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వ్యక్తిని లత్తు కలిండిగా పోలీసులు గుర్తించారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన అతడు సైకో అని స్థానికులు చెబుతున్నారు.

కానిస్టేబుల్ పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, ఆ వ్యక్తి గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. వెస్ట్ బెంగాల్ కు చెందిన కలిండి(25) సైకో అని, పోలీస్ యూనిఫామ్ లో ఉన్నవారిని చూస్తే ఉన్మాదిగా మారిపోతాడని తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు.

Also Read : షాకింగ్.. ఫ్రెండ్ ప్రాణం తీసిన సరదా.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి..

 

ట్రెండింగ్ వార్తలు