USA : అమెరికా చికాగోలో దారుణం.. తల్లీదండ్రులు, ఇద్దరు పిల్లలతోపాటు మూడు కుక్కలను కాల్చి చంపారు

ఆ ఇంట్లో వారితోపాటు ఉంటున్న మూడు కుక్కలను కూడా కాల్చి చంపారు. ఈ ఘటనను ప్రస్తుతం కేవలం హత్య కోణంలో మాత్రమే విచారిస్తున్నట్లు రోమియోవిల్లే పోలీసులు తెలిపారు.

Four And Three Dogs Kill

Four And Three Dogs Kill USA : అమెరికాలోని చికాగోలో దారుణం జరిగింది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు మూడు క్కలను కాల్చి చంపేశారు. రోమియోవిల్లే ప్రాంతంలోని ఓ ఇంట్లో తల్లీదండ్రులు, వారి ఇద్దరు పిల్లలతో పాటు ఆ ఇంట్లో ఉన్న మూడు కుక్కలను కూడా కాల్చి చంపారు. ఈ ఘోర ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది.  ఆ దంపతులు ఆల్బర్టో రోలన్, జొరైడా బర్టోలెమిగా గుర్తించారు.

వారి పిల్లలు పదేళ్ల ఆడ్రియల్, ఏడేళ్ల డీగో కూడా మృతి చెందారు. ఆ ఇద్దరు పిల్లలు రాబర్ట్ సీ హిల్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకుంటున్నారు. ఆ ఇంట్లో వారితోపాటు ఉంటున్న మూడు కుక్కలను కూడా కాల్చి చంపారు. ఈ ఘటనను ప్రస్తుతం కేవలం హత్య కోణంలో మాత్రమే విచారిస్తున్నట్లు రోమియోవిల్లే పోలీసులు తెలిపారు.

Secunderabad : గుండెలు పిండే విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య, ఆ బాధ తట్టుకోలేక..

దీన్ని హత్య – ఆత్మహత్యగా భావించడం లేదని పేర్కొన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్టు జరగలేదు. ఇంటి యజమాని పనికి వెళ్లకపోవడంతో అతనికి అనేకసార్లు ఫోన్ చేశారు. ఫోన్ రిప్లై ఇవ్వకపోవడంతో ఓ బంధువు ఆ ఇంటికి వెళ్లాడు. అప్పుడు ఈ ఘటన బయటపడింది.

ట్రెండింగ్ వార్తలు