Massive Earthquake In China: చైనాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ధాటికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు భూకంపం సంభవించినట్టు చైనా భూకంప నమోదు కేంద్రాన్ని ఉటంకిస్తూ చైనా ప్రభుత్వ జిన్హువా ఏజెన్సీ తెలిపింది. నైరుతి చైనాలోని సిచుయాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు తెలిపింది.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రాథమిక వార్తల ప్రకారం, సిచువాన్ ప్రావిన్స్లోని పలు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు తీవ్రంగా దెబ్బతినట్టు తెలుస్తోంది. పలు ఏరియాల్లో టెలి కమ్యూనికేషన్ లైన్లు తెగిపోయాయి.
రాజధాని చెంగ్డు, దానికి సమీపంలోని చాంగ్వింగ్ మెగాసిటీ సమీపంలో పలు భవంతులు కొద్ది సెకన్లు కంపించాయని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం 500 మందికి పైగా సహాయ సిబ్బంది రంగంలోకి దింపారు. టిబెట్కు ఆనుకుని ఉన్న సిచువాన్ ప్రావిన్స్లో తరచు భూపంకంపాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. టిబెట్ పీఠభూమిలోనూ భూకంపాలు నమోదవుతుంటాయి.
Kartavya Path: చారిత్రక రాజ్పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ పేరు మార్చనున్న కేంద్రం