Mark Zuckerberg : జుకర్ బర్గ్ ట్విట్టర్ లో రీ ఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత తొలి పోస్టు

2012జనవరి 18న జుకర్ బర్గ్ ఆఖరిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే తొలిసారి.

Mark Zuckerberg

Mark Zuckerberg Re-Enter Twitter : ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 11 ఏళ్ల తర్వాత జుకర్ బర్గ్ తొలి పోస్టు చేశారు. ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ యాప్ ను తీసుకొచ్చిన సందర్భంగా జుకర్ బర్గ్ ట్విట్టర్ లో గురువారం ఉదయం ఫొటో చేశారు. 1967 నాటి స్పైడర్ మ్యాన్ కార్టూన్ ను పోస్టు చేసిన జుకర్ బర్గ్ .. దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు.

అయితే, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ను ఉద్ధేశించే జుకర్ బర్గ్ ఈ పోస్టు షేర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, 2012జనవరి 18న జుకర్ బర్గ్ ఆఖరిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే తొలిసారి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్ కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొత్త యాప్ ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Twitter – Meta Thred New App : ఎలాన్ మస్క్‌ ట్విట్టర్‌ను ఢీ కొట్టేందుకు ‘థ్రెడ్’ రెడీ అవుతున్న జుకర్ బర్గ్

ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. థ్రెడ్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది.

ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ పేర్కొన్నారు. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త థ్రెడ్స్ యాప్ ను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు. ఇందులో సుమారు వర్డ్స్ తో లింక్స్, ఫోటోలు, ఐదు నిమిషాల నిడివి గల వీడియోలు కూడా పోస్ట్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు