Chiranjeevi : ఆ ఇద్దరి యంగ్ డైరెక్టర్స్‌తో చిరంజీవి సినిమా.. నిజమేనా?

భోళా శంకర్ సినిమా తరువాత చిరంజీవి ఆ ఇద్దరి యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేయనున్నాడట. త్వరలోనే ఆ చిత్రాల పై అధికారిక ప్రకటన రానుందని..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని వాల్తేరు వీరయ్య సినిమాతో గ్రాండ్ గా స్టార్ చేశాడు. ఏకంగా 220 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ఇప్పటి యంగ్ హీరోలకు కూడా తానే పోటీ అంటూ సవాలు విసిరాడు. ఇక ఈ సినిమాతోనే మొదలు పెట్టిన భోళా శంకర్ (Bholaa Shankar) ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాలు తరువాత చిరంజీవి ఇప్పటి వరకు మరో మూవీని ప్రకటించలేదు. కానీ చిరు పలానా డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ మాత్రం రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది.

Bholaa Shankar: అప్పుడు భాషా.. ఇప్పుడు భోళా శంకర్.. సేమ్ సెంటిమెంట్..?

అయితే కొన్ని రోజులు నుంచి మాత్రం ఇద్దరి దర్శకులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార’ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు వశిష్టతో ఒక సినిమా ఒకే చేసినట్లు తెలుస్తుంది. వశిష్ట చెప్పిన స్టోరీ నచ్చడంతో చిరు పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసేమని ఆర్డర్ పాస్ చేసినట్లు సమాచారం. అలాగే నాగార్జునకి ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ వంటి హిట్ చిత్రాలను అందించిన కళ్యాణ్‌ కృష్ణతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ రెండు చిత్రాల అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Orange : జపాన్‌లో ఆరెంజ్ రీ రిలీజ్ సందడి.. వీడియో వైరల్!

మరి ఈ రెండు సినిమా వార్తలు నిజామా? లేదా గాసిప్ మాత్రమేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇక భోళా శంకర్ విషయానికి వస్తే.. మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కలకత్తాలో జరుగుతుంది. తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ వస్తున్న ఈ చిత్రంలో తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరు చెల్లిగా కనిపించబోతుంది. ఆగష్టు 11న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

 

ట్రెండింగ్ వార్తలు