Gold and Silver Rate Today : దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. బంగారం ధర ఇప్పటికే గత రికార్డులను తిరగరాస్తుండగా.. తాజాగా వెండి ధరసైతం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. కిలో వెండి ధర రూ. లక్షకు చేరువలో ఉంది. శనివారం ఒక్కరోజే కిలో వెండిపై రూ. 4వేలు పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 96,500కు చేరింది. గత నాలుగు రోజులుగా వెండి ధర భారీగా పెరుగుతూ వస్తోంది. నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 6, 500 పెరిగింది. బంగారం ధరసైతం భారీగా పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 870 పెరిగింది. దీంతో బంగారం ధర సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,450కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.74,620.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,550 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,770.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,400 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,620.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,500 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.74,730.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.96,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 96,500.
కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.93,000.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 89,000 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.