Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్లో సినిమా సమస్యలపై చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్తో పాటు పలువురు దర్శకులు వెళ్లి సీఎం జగన్తో చర్చించారు. ఈ సమావేశంపై ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ వెళ్లడంపై ట్విట్టర్లో ట్వీట్ ద్వారా స్పందించారు.
“సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్ని నేను అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
అంతకుముందు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ వేసి డిలీట్ చేశారు. ‘ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా’ అంటూ ట్వీట్ చేశారు. తర్వాత కాసేపటికే డిలీట్ చేశారు. ఇదిలా ఉంటే సమావేశం జరిగిన వారంలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
Though it happened because of SUPER, MEGA, BAHUBALI LEVEL BEGGING , I am glad that the OMEGA STAR @ysjagan has blessed them.. I tremendously appreciate the SUPER,MEGA,BAHUBALIni minchina MAHABAL @ysjagan ? https://t.co/3oWTPGlG5u
— Ram Gopal Varma (@RGVzoomin) February 11, 2022