Kajol: బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన కాజోల్ గురించి ప్రత్యేకించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. రొమాంటిక్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, ఫ్యామిలీ ఆడియెన్స్కు కూడా బాగా దగ్గరయ్యింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఎవర్గ్రీన్ జంట ఎవరని అడిగితే, షారుఖ్-కాజోల్ పేర్లు ఇప్పటికీ వినిపిస్తుంది. అంతలా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ బ్యూటీ. ఇక నటుడు అజయ్ దేవ్గన్తో పెళ్లి తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దూసుకుపోతుంది.
అక్క, వదిన లాంటి క్యారెక్టర్స్తో పాటు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుల్లో లీడ్ రోల్స్ చేసేందుకు రెడీ అయ్యింది ఈ బ్యూటీ. అయితే తాజాగా కాజోల్ ఓటీటీ ప్రపంచంలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాంలో వెబ్ సిరీస్లో నటించేందుకు కాజోల్ ఓకే చేసిందట. అయితే ఈ వెబ్ సిరీస్లోని ఒక్కో ఎపిసోడ్కు ఈ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ వెబ్ సిరీస్ కోసం ఒక్కో ఎపిసోడ్కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందంటే, కాజోల్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. డిస్నీప్లస్ హాట్స్టార్లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబైలో మొదలుపెట్టారు. కాగా, ఈ వెబ్ సిరీస్ను సుపర్ణ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మరి కాజోల్ ఓటీటీ ఎంట్రీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.