Karthikeya2: మిస్టరీ వీడేది అప్పుడే అంటోన్న కార్తికేయ!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘కార్తికేయ-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన కార్తికేయ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీతో మరోసారి అలాంటి సక్సెస్‌ను కొట్టాలని కసిగా ఉన్నాడు నిఖిల్.

Karthikeya2: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘కార్తికేయ-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన కార్తికేయ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీతో మరోసారి అలాంటి సక్సెస్‌ను కొట్టాలని కసిగా ఉన్నాడు నిఖిల్. అయితే ఈసారి కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Karthikeya2: కార్తికేయ-2 వెనక్కి వెళ్తున్నాడా..?

దర్శకుడు చందూ మొండేటి ఒక అద్భుతమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలోని మిస్టరీ, ట్విస్టులు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన వస్తుండటంతో ఈ సినిమా గ్యారెంటీ హిట్ అనే ముద్రను వేసుకుంది. కాగా, ఈ సినిమాను తొలుత జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు.

Karthikeya2: ‘ఇస్కాన్ బృందావన్’లో కార్తికేయ-2 టీమ్ సందడి

దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సరికొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆగస్టు 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఓ మోషన్ పోస్టర్‌తో రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, శ్రీనివాస్ రెడ్డి, అనుపమ్ ఖేర్, హర్ష తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను టిజి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఆగస్టు 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు