Kartikeya : ‘ఆర్ఎక్స్ 100’తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ ఈ నెల 21న తాను ప్రేమించిన అమ్మాయి లోహిత రెడ్డిని హైదరాబాద్లో వైభవంగా మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వివాహానికి అనేకమంది సినీ సెలబ్రిటీలు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కార్తికేయ పెళ్ళికి విచ్చేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత రిసెప్షన్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు ఈ దంపతులు. రిసెప్షన్ కి కూడా పలువురు సెలబ్రిటీలు విచ్చేసి సందడి చేశారు.
Trivikram : త్రివిక్రమ్ ట్వీట్.. పేర్ని నాని రిప్లై.. అంతా ఫేక్!
తాజాగా హీరో కార్తికేయ తన భార్య, కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతన వధువరులు తిరుమల వెంకన్న ఆశీస్సులు తీసుకున్నారు. టిటిడి సిబ్బంది హీరోతో పాటు అతని కుటుంబ సభ్యులకు శాలువా కప్పి స్వామి వారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా కొత్త దంపతులు తిరుమలలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.