Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసారా’పై ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను హిస్టారికల్ కాన్సెప్ట్తో తెరకెక్కిస్తుండగా, ఫాంటెసీ అంశాలు హైలైట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వైభిన్నమైన పాత్రల్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
Bimbisara: బింబిసారా కోసం రాజు గారి ఎంట్రీ!
రిలీజ్కు రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం నుండి ‘ఓ తేనె పలుకుల’ అనే డ్యూయెట్ సాంగ్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్లో అందాల భామ కేథరిన్ త్రేజాతో కళ్యాణ్ రామ్ చేసిన రొమాన్స్ అద్భుతంగా ఉండగా, విజువల్ పరంగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సినిమాను దర్శకుడు వశిష్ట్ అద్భుతమై స్టోరీలైన్తో తెరకెక్కించగా, ఈ సినిమాను ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా, ఈ సినిమాను కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మరో భామ సంయుక్తా మీనన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, దిల్ రాజు – శిరీష్లు వీక్షించినట్లుగా చిత్ర దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.