నేడు కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం

Pinarayi Vijayan :కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. సెంట్రల్ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 500 మంది హాజరవుతారు. సిపిఐ (ఎం) శాసనసభాపక్ష నాయకుడిగా, కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ను సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ మంగళవారం నియమించింది.

ప్రమాణస్వీకారానికి హాజరయ్యే వారి జాబితాలో 21 మంది క్యాబినెట్ మంత్రులు, ఆహ్వానితులలో 140 మంది శాసనసభ్యులు, 29 మంది ఎంపీలు, న్యాయవ్యవస్థ, మీడియా మరియు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక వచ్చే వారందరికీ 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ నెగటివ్ టెస్ట్ ఫలితం ఉండాలి లేదా టీకా రెండు మోతాదులను తీసుకోవాలని విజయన్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు