PM Modi: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్కి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బానెన్స్తో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. ఇద్దరు ప్రధానమంత్రులు నాలుగ టెస్ట్ మ్యాచ్ను ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ సందర్భంలో ప్రధాని మోదీకి ఒక సర్ప్రైజ్ బహుమతి లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి అయిన జయ్ షా ఇచ్చిన బహుమతి కావడంతో దానికి మరింత ప్రాధాన్యత వచ్చింది.
नरेंद्र मोदी स्टेडियम में नरेंद्र मोदी जी को नरेंद्र मोदी जी की तस्वीर भेंट करते नरेंद्र मोदी जी के दोस्त के बेटे। pic.twitter.com/F8GkeXjJ0a
— Congress (@INCIndia) March 9, 2023
నరేంద్రమోదీ ఫొటోతో తయారు చేసిన ఒక ఫొటో ఫ్రేంని మోదీకి ఇచ్చారు జయ్ షా. అది కూడా నరేంద్రమోదీ స్టేడియంలో నరేంద్రమోదీకి ఆయన ప్రతిమతోనే బహుమతి ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ఫొటో మీద విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘‘నరేంద్రమోదీ స్టేడియంలో నరేంద్రమోదీకి నరేంద్రమోదీ ఫొటోను బహూకరించిన నరేంద్రమోదీ మిత్రుడి కుమారుడు’’ అని క్యాప్షన్ రాసింది.