Sai Pallavi : నాగశౌర్య వ్యాఖ్యలపై మూడేళ్ళ తర్వాత స్పందించిన సాయి పల్లవి

ఇటీవలే సాయి పల్లవి కలర్, అందం గురించి ట్రోల్ చేస్తూ కొన్ని తమిళ మీడియాలు రాశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీటి గురించి, అలాగే మూడేళ్ళ కిందట నాగశౌర్య చేసిన వ్యాఖ్యలపై............

Naga Shourya :  ‘ఫిదా’ సినిమాతో హైబ్రిడ్ పిల్లగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దూసుకుపోతుంది సాయి పల్లవి. తెలుగులో చేసిన తక్కువ సినిమాలకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో సాయి పల్లవికి, ఆమె డ్యాన్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో మరోసారి అందర్నీ మెప్పించింది.

సాయి పల్లవి గతంలో తమిళ్, తెలుగు భాషల్లో ‘కణం’ అనే ఒక సినిమా చేసింది. ఇందులో నాగశౌర్యతో కలిసి నటించింది. అయితే ఆ సినిమా టైంలో నాగశౌర్యతో గొడవలు జరిగాయని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. నాగశౌర్య ఆ సినిమా రిలీజ్ టైంలో “కణం” సినిమా షూటింగ్ సమయంలో సాయి పల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానని మూడేళ్ల కిందట కామెంట్ చేశాడు. అప్పుడు దీని గురించి సాయి పల్లవి స్పందించలేదు.

Kiran Abbavaram : రేచీకటి పాత్రలో కిరణ్ అబ్బవరం.. ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్ రిలీజ్

ఇటీవలే సాయి పల్లవి కలర్, అందం గురించి ట్రోల్ చేస్తూ కొన్ని తమిళ మీడియాలు రాశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీటి గురించి, అలాగే మూడేళ్ళ కిందట నాగశౌర్య చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. ”గతంలో కూడా హీరో నాగశౌర్య నాపై కొన్ని కామెంట్స్‌ చేశాడు. అవి విని నేను చాలా బాధపడ్డాను. శౌర్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటన బావుంటుంది. అయితే అందరూ నాలో నచ్చిందే చెప్తారు. కానీ శౌర్య నాలో నచ్చని విషయం చెప్పాడు. దానిని నేను పాజిటివ్ గానే తీసుకున్నాను. నా వలన తను ఇబ్బంది పడితే నేను బాధపడినట్లే. నా సమాధానంతో తను సంతృప్తి చెందుతాడని అనుకుంటున్నాను” అని సాయిపల్లవి తెలిపింది.

Vishnu Vishal : తండ్రి మాట్లాడుతుంటే స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో

అయితే గతంలో ఎప్పుడో మూడేళ్ళ క్రితం జరిగిన విషయానికి సాయి పల్లవి ఇప్పుడు స్పందించి మాట్లాడటం విశేషం. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై నాగశౌర్య మళ్ళీ స్పందిస్తాడో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు