Samsung Galaxy A-series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) జనవరి మధ్య నాటికి భారత మార్కెట్లో రెండు 5G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. షావోమీ రెడ్మి నోట్ 12 సిరీస్ (Redmi Note 12 Series)లో 3 మిడ్-బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy A14 5G) Galaxy A23 5Gలను ఈ నెలలో దేశంలో మార్కెట్లో లాంచ్ చేయనుంది. రెండు స్మార్ట్ఫోన్లు ఇప్పటికే ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.
భారతీయ మార్కెట్లలో ఒకే స్పెసిఫికేషన్లతో శాంసంగ్ A-సిరీస్ వచ్చే అవకాశం ఉంది. Galaxy A14 5G ధర రూ. 15వేల నుంచి లాంచ్ అవుతుందని నివేదిక తెలిపింది. కనెక్టివిటీ మాత్రమే కాకుండా.. రెండు స్మార్ట్ఫోన్లు డిస్ప్లే టెక్నాలజీతో వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ AMOLED, OLED డిస్ప్లే ప్యానెల్లతో రానున్నాయి. అనేక స్మార్ట్ఫోన్ OEMలు తమ డివైజ్లలలో డిస్ప్లేలను కూడా అందించనున్నాయి.
Galaxy A14 5G ఫోన్ ఈ నెల ప్రారంభంలో అమెరికాలో 64GB స్టోరేజ్ వేరియంట్కు దాదాపు రూ. 16,500కి అందుబాటులోకి వచ్చింది. ఫుల్-HD+ (1,080×2,408 పిక్సెల్లు) డిస్ప్లేతో 90Hz 6.6-అంగుళాల LCD డిస్ప్లేతో పాటుఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700ని కలిగి ఉంది. వెనుకవైపు ఉన్న కెమెరా సిస్టమ్లో 50-MP ప్రైమరీ కెమెరా, రెండు 2-MP సెన్సార్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లో అల్ట్రా-వైడ్ యాంగిల్ లేదు. ఇతర ముఖ్య ఫీచర్లలో 13-MP ఫ్రంట్ కెమెరా, Wi-Fi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 5.2, GPS,15W ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ ఉన్నాయి.
Galaxy A23 5G అనేది 50-MP ప్రైమరీ కెమెరాతో వచ్చినప్పటికీ మరింత ప్రీమియంగా రానుంది. షావోమీ భారత్ మార్కెట్లో Redmi Note 12తో మాదిరిగా Samsung Galaxy A23 5G కెమెరా సెక్షన్ ఎడ్జెట్ చేయవచ్చు. గెలాక్సీ స్మార్ట్ఫోన్ 5.8-అంగుళాల HD+ (720×1,560 పిక్సెల్లు) TFT డిస్ప్లేతో పాటు అదే డైమెన్సిటీ 700 SoCని కొనసాగించవచ్చు.
సింగిల్ 50-MP ప్రైమరీ కెమెరాతో పాటు, 5-MP ఫ్రంట్ కెమెరా సెన్సార్, 4G/LTE, బ్లూటూత్ v5.2, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్తో వస్తుంది. ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 12-ఆధారిత OneUI, 4,000mAh బ్యాటరీతో పాటు 64GB స్టోరేజీ కలిగి ఉన్నాయి.
ఈ స్మార్ట్ఫోన్ నవంబర్ 2022లో లాంచ్ అయింది. జపాన్లో ఈ ఫోన్ ధర సుమారు రూ. 18,200గా ఉంది. రాబోయే కొత్త శాంసంగ్ ఫోన్లు ఈ వారం ప్రారంభంలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. Redmi Note 12 ఫీచర్లతో సమానంగా ఉండనున్నాయి. బేస్ వేరియంట్ ధర రూ.17,999, టాప్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. Redmi Note 12 5G ఫోన్ 120Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..