Koratala Siva: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తూ వస్తున్నారు. వారి ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో తారక్ తన కెరీర్లోని 30వ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను నేడు ప్రతిష్టాత్మకంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమా ప్రారంభం కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. గతంలో కొరటాల శివతో ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో రావడంతో, ఈసారి వీరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందా.. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే, అభిమానుల ఆసక్తిని గమనించిన దర్శకుడు కొరటాల, తాజాగా ఈ సినిమా స్టోరీలైన్ ఏమిటో చెప్పేశాడు. ఈ సినిమా కథ గురించి కొరటాల చెప్పేయడంతో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాపై జోరుగా చర్చ సాగుతోంది.
Koratala Siva: ఆచార్య దెబ్బకు తెగ కష్టపడుతోన్న కొరటాల..?
గతంలోనూ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాపై కొరటాల పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నాడని.. అయితే ఆ సినిమాలో పాదఘట్టం అంటూ ఓ టాపిక్ పట్టుకొచ్చి.. సినిమా కథను ప్రేక్షకులు మెచ్చే విధంగా మలచలేకపోయాడని కొరటాలను ఇప్పుడు మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు. ‘‘కొంపదీసి ఈసారి ఏ సముద్రఘట్టం పట్టుకు రావడం లేదుగా’’ అంటూ కొరటాలను ట్రోలర్స్ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు, ట్రోలర్స్ మధ్య వార్ నడుస్తోంది. మరి ఈ సినిమాను కొరటాల ఎంత పవర్ఫుల్గా మలుస్తాడో తెలియాలంటే, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.