Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించగా, బాలయ్య మరోసారి విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్లో చెలరేగిపోయాడు.
Veera Simha Reddy: పాన్ ఇండియా మూవీగా వస్తున్న వీరసింహారెడ్డి
బాలయ్య పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాకు థియేట్రికల్ రన్ సక్సెస్ఫుల్గా ముగియడంతో, ఈ సినిమాను ఫిబ్రవరి 23న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఆసక్తిని చూపారు.
Veera Simha Reddy: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న వీరసింహారెడ్డి
ఈ క్రమంలో కేవలం ఒకే ఒక నిమిషంలో వీరసింహారెడ్డి చిత్రాన్ని ఏకంగా 150K+ యునీక్ వ్యూవర్స్ ఈ సినిమాను వీక్షించినట్లుగా డిస్నీప్లస్ హాట్స్టార్ తెలిపింది. ఇలా ఒక సినిమా కోసం కేవలం ఒక నిమిషంలోనే ఇంత భారీ సంఖ్యలో వ్యూవర్స్ సినిమాను వీక్షించేందుకు సిద్ధపడటం నిజంగా విశేషమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శ్రుతి హాసన్, హనీ రోజ్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.