Mumbai
Mumbai : ముంబయి ప్రజలకు చాలా సహనం ఉంది. ఒకరినొకరు గౌరవించుకుంటారు.. ఇలా ట్విట్టర్ నిండా వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. డోంబివిలి రైల్వే స్టేషన్లో భారీ… క్యూ కనిపించింది. క్యూలో నిలబడ్డవారంతా ఎంతో సహనంగా కనిపించారు. గొడవలు పడకుండా సంయమనంతో ఉన్నారు. ఈ క్యూ అంతా దేనికోసం అనుకునేరు.. ఆటో కోసమట.
ముంబయి రైల్వే స్టేషన్ బ్రిడ్జి నుంచి ప్రజలు భారీ క్యూ కట్టారు. ఆటో ఎక్కడానికి ఎదురుచూస్తు తమ వంతు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వీరికి ఉన్న సహనం.. వీరి మధ్య ఉన్న సంయమనం చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. @Madan_Chikna అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వ్యూస్తో దూసుకుపోతోంది. థానేలోని ఉల్హాస్ నది ఒడ్డున ఉన్న సబర్బన్ సిటి డోంబివిలి నుంచి ఈ వీడియో వచ్చింది.
బ్రిడ్జి మీద క్యూలో నిలబడిన వ్యక్తుల్ని చూపిస్తూ వీడియో మొదలవుతుంది. ఇక వీడియోలో ఆ క్యూ ఎక్కడ ఎండ్ అవుతుందా? అని చూపరుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ క్యూలో నిలబడ్డ వారు ఏ మాత్రం ఒత్తిడి, ఆందోళనకు గురైనట్లు కనిపించలేదు. ‘సాయంత్రం రద్దీ సమయంలో డోంబివిలిలో ఆటో కోసం క్యూ కట్టిన ప్రజల్లో అద్భుతమైన సహనం కనిపిస్తోంది’ అనే శీర్షికతో ఈ పోస్ట్ షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు.
Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!
‘మొబైల్ ఫోన్లు లేకపోయుంటే వీరంతా ఏమి చేసి ఉండేవారని ఆలోచిస్తున్నాను’ అని ఒకరు..’ ఆటో కోసం వేచి ఉండటం కంటే వేగంగా నడిచి వెళ్తే ఇంటికి చేరుకుంటారుగా?’ అని మరొకరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎంత కష్టంలో అయినా సంతోషంగా, సహనంగా ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలో ముంబయివాసుల్ని చూసి నేర్చుకోవాలని చాలామంది కితాబు ఇచ్చారు.
The Auto Rickshaw queue in Dombivli during evening peak hours showcases people’s remarkable patience. #MumbaiRains #MumbaiSpirit pic.twitter.com/i7Pgv21peZ
— Godman Chikna (@Madan_Chikna) June 29, 2023