Nabha Natesh : యాక్సిడెంట్ నుంచి కోలుకున్న నభా నటేష్.. ప్రెస్ నోట్ రిలీజ్!

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో అందరి మనసులను దోచుకుంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ భామ, గత ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. కాగా గత ఏడాది తనకి యాక్సిడెంట్ అయినట్లు, దాని నుంచి ఇప్పుడు కోలుకున్నట్లు ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.

Nabha Natesh : నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో అందరి మనసులను దోచుకుంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ భామ, గత ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. చివరిగా నభా నటించిన సినిమా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’. సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే కనబడుతున్న ఈ భామ సినిమాలో కనిపించకపోవడంతో.. సినిమా ఆఫర్లు రావడం లేదు అని అనుకున్నారు అందరూ. కానీ అసలు విషయం ఇప్పుడు బయట పెట్టింది నాభ.

Nabha Natesh : థైస్‌తో థండర్ షో చేస్తున్న నభా నటేష్..

గత ఏడాది తనకి యాక్సిడెంట్ అయినట్లు, దాని నుంచి ఇప్పుడు కోలుకున్నట్లు ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది. ‘నేను కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మీరందరూ నన్ను మిస్ అయ్యారని నాకు తెలుసు. అలాగే నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను. గత సంవత్సరం నాకు చాలా కష్టంగా గడిచింది. నేను ఒక ఘోర ప్రమాదంలో పడ్డాను. దాని వాళ్ళ నా ఎడమ భుజం గాయపడింది. ముల్టీపుల్ బోన్ ఫ్యాక్చర్స్ అయ్యింది.

దీంతో రిపీటెడ్‌గా అనేక సార్లు శస్త్రచికిత్సలు చేయవలసి వచ్చింది. ఆ సమయంలో నేను మానసికంగా, శారీరకంగా భరించలేని బాధని అనుభవించాను. కానీ సినిమాలు ద్వారా నేను మిమ్మల్ని అలరించినందుకు బదులుగా మీరు అందించిన ప్రేమ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. గతంలో కంటే బలంగా మారాను. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో అలరించేందుకు నేను కెమెరా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మీతో షేర్ చేసుకోడానికి చాలా సంతోషంగా ఉంది” అంటూ వెల్లడించింది. ఇక ఈ వార్త తెలుసుకున్న అభిమానులు.. ‘వెండితెరపై మిమ్మల్ని ఎప్పటిలా ఎనర్జిటిక్ గా చూడడానికి మేము వెయిట్ చేస్తున్నాము’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు