Janaki Ramayya Gari Manavaralu : ‘జానకి రామయ్యగారి మనవరాలు’.. కొత్త సీరియల్ ఎప్పట్నించి? ఎందులో?

జీ తెలుగు ఛానల్ లో మరో సరికొత్త సీరియల్ రాబోతుంది.

Janaki Ramayya Gari Manavaralu Serial : సీరియల్స్, పలు ఎంటర్టైన్మెంట్ షోలు అందించే జీ తెలుగు ఛానల్ లో మరో సరికొత్త సీరియల్ రాబోతుంది. రాజీవ్​, సంగీత ప్రధాన పాత్రల్లో, ఫాతిమా బాబు, రాజశేఖర్​, అర్చన, జాకీ, కల్యాణ్​ ప్రసాద్.. పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న సీరియల్ ‘జానకి రామయ్యగారి మనవరాలు’.

తరతరాల నుంచి వస్తున్న మిఠాయి వ్యాపారం చేస్తున్న ఉత్తమ్ (రాజీవ్) చుట్టూ ఈ సీరియల్ కథ సాగుతుంది. కుటుంబ కలహాలు, గతం బాధల కారణంగా ఉత్తమ్ నానమ్మ (ఫాతిమా బాబు), తల్లి, మేనత్త, అత్త తమ కలలను ఉత్తమ్​పై రుద్దుతారు. చిన్నప్పట్నుంచి ఉత్తమ్ ని వీరంతా కలిసి పెంచడంతో ఈ నలుగురిని తన తల్లులుగానే భావిస్తాడు ఉత్తమ్​. ఉత్తమ్ కి పెళ్లి చేయాలనుకున్న సమయంలో ఉత్తమ్​ కలలో ఓ పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఆ అమ్మాయి కోసం వెతుకుతాడు ఉత్తమ్​. మాములు మిడిల్ క్లాస్ కి చెందిన బ్యాంకు ఉద్యోగి అయిన మైథిలి(సంగీత)తో ఉత్తమ్ ప్రేమలో పడతాడు. వీరి ప్రేమని ఉత్తమ్ కుటుంబం ఒప్పుకుందా లేదా అసలు ఈ జానకి రామయ్యగారి మనవరాలు ఎవరు? ఆమెకు కుటుంబానికి సంబంధం ఏంటి అనే కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది.

Also Read : Shalini – Ajith Kumar : అజిత్ బర్త్ డేకి భార్య షాలిని ఇచ్చిన గిఫ్ట్ అదిరిందిగా.. భర్తకు ఇష్టమని..

కుటుంబ ఎమోషన్స్, మహిళ బాధలు, ప్రేమ.. అంశాలతో భావోద్వేగంగా తెరకెక్కుతున్న జానకి రామయ్యగారి మనవరాలు జీ తెలుగులో మే 6న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటికే సీరియల్ ప్రోమోలతో ఆడియన్స్ కి దగ్గరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు