SS Kanchi : పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి.. ఆదిపురుష్ పై రాజమౌళి సోదరుడు కౌంటర్..

టీజర్ బాగున్నా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు వస్తున్నాయి.పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, షూటింగ్ త్వరగా పూర్తయినప్పుడే కొంతమంది ఇది గ్రాఫిక్స్ సినిమా కాదు కదా అని అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి............

SS Kanchi :  ప్రభాస్ ఫ్యాన్స్‌ రెండేళ్లుగా ఆదిపురుష్ కోసం ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌ 2న అయోధ్యలో గ్రాండ్‌గా జరిగిన ఆదిపురుష్ ఈవెంట్‌లో టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే టీజర్ చూడటానికి బాగున్నా మొత్తం VFX లతోనే ఉండటంతో ఇది కార్టూన్ సినిమాలాగా అనిపిస్తుంది.

దీంతో టీజర్ బాగున్నా ఆదిపురుష్ సినిమాపై విమర్శలు వస్తున్నాయి.పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, షూటింగ్ త్వరగా పూర్తయినప్పుడే కొంతమంది ఇది గ్రాఫిక్స్ సినిమా కాదు కదా అని అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. టీజర్ చూసిన తర్వాత ఇది ఒక యానిమి సినిమాలాగా ఉందని, బొమ్మల సినిమా, కార్టూన్స్ లా ఉందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ ని తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Adipurush : బొమ్మల సినిమా చూపిస్తావా అంటూ.. ఆదిపురుష్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్..

సినిమా నిజంగానే కార్టూన్, గ్రాఫిక్స్ సినిమా అయితే మాత్రం దర్శకుడిని మరింత ట్రోల్స్ చేస్తాం అని బాహాటంగానే చెప్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే రజినీకాంత్ కొచ్చాడియన్, కింగ్ కాంగ్, ఏప్ సినిమాలు లాంటివి గుర్తొస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఇండైరెక్ట్ గా రాజమౌళి సోదరుడు కామెంట్ చేశారు.

‘అమృతం’ సీరియల్ తో పాటు ‘సై’, మర్యాదరామన్న లాంటి పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలు పోషించారు రాజమౌళి సోదరుడు SS కాంచి. నటుడిగానే కాక రచయితగా కూడా పలు సినిమాలకి పని చేశారు కాంచి. తన ట్విట్టర్ అకౌంట్ లో అప్పుడప్పుడు పలు అంశాలపై స్పందిస్తూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కాంచి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Adipurush VFX : ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్‌పై విపరీతంగా ట్రోలింగ్.. చేసింది మేము కాదని NY VFXWaala క్లారిటీ

మన దేశంలో పౌరాణిక సినిమాలంటే తెలుగు వాళ్ళు తీసినవే చాలా బాగా హిట్ అయ్యాయి. గతంలో ఎన్నో పౌరాణిక సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజైన ఈ టీజర్ చూస్తే ఇదేదో హాలీవుడ్ సినిమాలా ఉంది కానీ మన రామాయణం అనే ఫీల్ మాత్రం రావట్లేదు అని అంతా అంటున్నారు.

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యాక కాంచి తన ట్విట్టర్ లో ‘పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి’ అని ట్వీట్ చేశారు. దీంతో ఇది ఇండైరెక్ట్ గా ఆదిపురుష్ టీజర్ మీదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. SS కాంచి చెప్పింది కూడా నిజమే అని అంటున్నారు. ఏదేమైనా ఆదిపురుష్ టీజర్ అందరి అంచనాలని తలకిందులు చేసిందనే చెప్పొచ్చు.

ట్రెండింగ్ వార్తలు