MLA HD Ranganath : నొప్పులతో ఆయన ఇంటికెళితే నవ్వుతు పంపిస్తున్న ఎమ్మెల్యే .. ఇలాంటి నేతలు కదా కావాల్సింది..

నడవలేకపోతున్నానయ్యా ఒకటే నొప్పులు ఏదైనా సహాయం చేయండయ్యా అంటూ ఆయన ఇంటికెళితే నవ్వుతు పంపిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. ఆర్థిక సహాయం కోసం వెళితే సమస్యల్ని పరిష్కరించి తన నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.

Karnataka MLA Dr HD Ranganath knee free surgeries

MLA HD Ranganath : ఆయనో ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే తన నియోజక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన వ్యక్తి. స్థానిక సమస్యలు..మౌలిక సమస్యల్ని పరిష్కరిస్తుంటారు ప్రజా ప్రతినిధులు. వారి వారి నియోజవర్గంలో అభివృద్ధి పనులు చేయాల్సిన బాధ్యత వారిది. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం ప్రజలు తన వద్దకు మోకాళ్ల నొప్పులు, తుంటి నొప్పులతో వచ్చేవారి నొప్పులుతగ్గించేస్తున్నారు. నొప్పుల బాధతో తన వద్దకు వచ్చేవారిని నవ్వుతు ఇంటికి పంపిస్తున్నారు.

ఆయనే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్. కర్ణాటకలోని కునిగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు హెచ్‌డీ రంగనాథ్. కొంతమంది ప్రజాప్రతినిధులు గెలిచాక ప్రజల సమస్యల్ని పట్టించుకోరు. చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోరు. కానీ ఎమ్మెల్యే రంగనాథ్ అలాకాదు. హెచ్‌డీ రంగనాథ్ వృత్తి రీత్యా డాక్టర్. కానీ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. సాధారణంగా ఎమ్మెల్యేగా గెలిచాక బిజీ అయిపోయి వారి వృత్తిని పక్కనపెట్టేస్తుంటారు. కానీ తన వృత్తిని తన నియోజక వర్గం ప్రజలకు అదనపు బెనిఫిట్ గా ఉపయోగపడుతున్నారు ఎమ్మెల్యే రంగనాథ్. వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్ అయిన ఎమ్మెల్యే రంగనాత్ తనకు వీలు చిక్కినప్పుడల్లా..ఓ రకంగా చెప్పాలంటే వీలు చేసుకుని డాక్టర్ గా కూడా బాధితులకు అండగా నిలబడుతున్నారు. ఆయనే స్వయంగా సర్జరీలు చేస్తున్నారు.

Indian womans Cosmetics : మేకప్ కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేసిన భారతీయ మహిళలు

తుమకూరు సమీపంలోని యాదవనికి చెందిన శివనంజయ్య అనే రైతు 20 ఏళ్లు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. శివనంజయ్యను పరీక్షించిన డాక్టర్లు అతడు రూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాడని.. మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని.. కార్పొరేట్ హాస్పిట్‌లో రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ అతనికి అంత ఆర్థిక స్తోమతలేదు. దీంతో ఆర్థిక సహాయం కోరుతు ఎమ్మెల్యే శివనంజయ్యకు మెరపెట్టుకున్నాడు.

అనతి పరిస్థితి విన్న ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేయటం కంటే తానే ఉచితంగా సర్జరీ చేస్తే బాగుంటుందని అనుకున్నారు.నీకు సహాయం కంటే సర్జీరి చేయటం మేలు అని చెప్పాడు.దానికి బాధితుడు సంతోషించాడు. ఆర్థిక సహాయం కోసం వస్తే సర్జీరీయే చేస్తాననటంతో సంతోషపడ్డాడు. దీంతో తన స్నేహితుడైన డాక్టర్ దీపక్‌తో కలిసి బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌లో శివనంజప్పకు ఉచితంగా ఎడమ మోకాలు సర్జరీ చేశారు. మరో కాలికి కూడా సర్జరీ చేయాలని దానికి మరో మూడు నెలలు ఆగాలని..మూడు నెలలు పోయాక కుడికాలికి కూడా మోకాలి కీలు సర్జరీని కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు. దీంతో ఆ రైతు ఆనందపడిపోయాడు.

కాగా..ఎన్నికల ప్రచారం సమయంలో కునిగల్ తాలుకాలోని కుందూరు అనే గ్రామానికి వెళ్లారు డాక్టర్ రంగనాథ్. ఈక్రమంలో ఆ ఊరికి చెందిన ఆశా శంకర్ అనే 42 ఏళ్ల మహిళ తన ఆరోగ్య పరిస్థితిని గురించి ఆయనకు చెప్పుకుంది. ‘నేను స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నాన..నా భర్త ఆటో డ్రైవర్ 12 ఏళ్ల క్రితం హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్నా. ఇటీవల మా ఇంటి దగ్గర కింద పడిపోయానయ్యా..అప్పటినుంచి తుంటి వద్ద విపరీతంగా నొప్పి వస్తోందని..దీంతో అస్సలు నడవలేకపోతున్నానని..ఆస్పత్రిలో చూపించుకుంటే ఆరేషన్ చేయాలని..రూ.5 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు’ అని చెప్పి వాపోయింది.

Heart Emoji : అక్కడంతే..వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే రూ.20 లక్షల జరిమానా, జైలుశిక్ష కూడా

దీంతో ఎమ్మెల్యే రంగనాత్ ఆమెకు ధైర్యం చెప్పారు. ఆమె మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. అనంతరం ‘‘ఎన్నికల హడావుడి కాస్త తగ్గనీయమ్మా.. నీకు నేనే ఫ్రీగా సర్జరీ చేస్తాను’’అని భరోసా ఇచ్చారు. కానీ గెలిచాక అది జరిగే పనేనా అని ఆమె అనుకుంది. కానీ గెలిచిన తరువాత కూడా రంగనాత్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

గత జూన్ 26న ఆమెకు బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్‌లో ఉచితంగా సర్జరీ చేశారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బంధువు అయిన రంగనాథ్ మైసూరులోని జేఎస్ఎస్ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎంఎస్) పూర్తి చేశారు. అలా డాక్టర్ అయినా ఆయన ప్రజాప్రతినిధిగా మారారు.

 

 

ట్రెండింగ్ వార్తలు