Pawan Kalyan: సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోలు వైరల్

పవన్‌ కల్యాణ్ ఇవాళ సింపుల్‌‌గా ఫార్మల్‌ లుక్‌ లో కనపడడం అభిమానులను అలరిస్తోంది.

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. త‌న భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుక‌లో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి పవన్ భార్య అన్నా లెజినోవా ఇవాళ ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ పట్టా పొందారు. ఆ వర్సిటీ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్నాక పవన్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్‌ కల్యాణ్ ఇవాళ సింపుల్‌‌గా ఫార్మల్‌ లుక్‌ లో కనపడడం అభిమానులను అలరిస్తోంది.

అనా కొణిదెలకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్, సోషల్ సైన్సెస్)లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మరోవైపు, అనా కొణిదెల మొదట రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు.

ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో అనా  కొణిదెల మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

కాగా, ఇటీవల పవన్‌, అన్నా లెజినోవా ఎయిర్‌పోర్టులో కనపడ్డారు. అన్నాను పవన్ కల్యాణ్ 2013లో పెళ్లి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని వారాల క్రితమే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సినిమాల్లో తక్కువగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నటించిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

Also Read : బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న సితార‌.. న‌మ్ర‌తా పోస్ట్ చూశారా..?

ట్రెండింగ్ వార్తలు