DRDO: తక్కువ శ్రేణి కలిగిన గగనతల రక్షణ మిస్సైల్స్ను డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చండీపూర్ నుంచి మంగళవారం జరిపిన క్షిపణి పరీక్ష విజయవంతమైందని డీఆర్డీవో ప్రకటించింది.
Indira Devi: మహేశ్ బాబుకు మాతృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూసిన ఇందిరాదేవి
ఇవి దేశీయంగా, పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన మిస్సైల్స్. హైదరాబాద్లోని డీఆర్డీవో సెంటర్లో ఈ మిస్సైల్స్ను తయారు చేశారు. భూమిపై పోర్టబుల్ లాంఛర్ నుంచి రెండు వేర్వేరు పరీక్షల్లో ఈ మిస్సైల్స్ ప్రయోగించారు. ఇవి గగనతల రక్షణ వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మిస్సైల్స్ వేర్వేరు టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. మినియేచరైజ్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియోనిక్స్ వంటి టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. ప్రధానంగా వాయు మార్గంలో వచ్చే ముప్పును తప్పించడానికి ఈ మిస్సైల్స్ ఉపయోగపడతాయి.
World No-3: అయ్యయ్యో అదానీ ర్యాంకు మళ్లీ పడిపోయింది.. రెండోసారి మూడో స్థానంలోకి ఆసియా కుబేరుడు
అంటే తక్కువ ఎత్తులో దూసుకొచ్చే ఇతర మిస్సైల్స్, విమానాలు, బాంబులు వంటివాటిని అడ్డుకుని ధ్వంసం చేస్తాయి. తాజాగా జరిపిన పరీక్షలో ఇవి విజయవంతంగా లక్ష్యాన్ని చేధించాయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవో సిబ్బందిని, నిపుణులను అభినందించారు.