మెగా హీరో వైష్ణవ్ తేజ్, అందాల భామ కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రంగరంగ వైభవంగా’ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్కు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు చీఫ్ గెస్టులుగా వచ్చి, చిత్ర యూనిట్కు తమ విషెస్ అందచేశారు.