Fake Baba Arrest : నగ్నంగా ఫోటోలు దిగితే ధనవంతులు అయిపోతారు..! పాతబస్తీలో గలీజు బాబా అరెస్ట్

మాటలతో గారడీ చేశాడు. దారిద్ర్యాన్ని తొలగిస్తానంటూ నమ్మించాడు. చెప్పింది చేస్తే కాసుల వర్షమే నంటూ ఆశ పెట్టాడు. సమస్యలు పోవాలంటే నగ్నంగా ఫోటోలు దిగాలని కండీషన్ పెట్టాడు.(Fake Baba Arrest)

Fake Baba Arrest : మాటలతో గారడీ చేశాడు. దారిద్ర్యాన్ని తొలగిస్తానంటూ నమ్మించాడు. చెప్పింది చేస్తే కాసుల వర్షమే నంటూ ఆశ పెట్టాడు. సమస్యలు పోవాలంటే నగ్నంగా ఫోటోలు దిగాలని కండీషన్ పెట్టాడు. ధనవంతులం అవుతామనే ఆశతో అతడు చెప్పినట్లు చేసిన మహిళలను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు.

పరువు పోతుందన్న భయంతో దొంగ బాబా అడిగినప్పుడల్లా మహిళలు డబ్బులు ఇస్తూనే ఉన్నారు. చివరికి దొంగ బాబా పాపం పండింది. ఓ బాధిత మహిళ చేసిన సాహసానికి నారీ నికేతన్ అధ్యక్షురాలు సఫియా అండగా నిలవడంతో బాబా గుట్టు రట్టైంది. ఆమె చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పక్కా స్కెచ్ తో కేటుగాడిని అరెస్ట్ చేశారు.

Also Read..Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం

మాయల మరాఠీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నకిలీ బాబా వందలకొద్ది మహిళలను మోసం చేసినట్లు.. పోలీసులు నిర్ధారించారు. అతడి ఫోన్ లో దాదాపు 500 మందికి పైగా మహిళల నగ్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నకిలీ బాబా తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు కర్నాటక రాష్ట్రంలోని బసవకల్యాణ్ లో ఉన్న మరో బాబా గులామ్ కు పంపిస్తున్నట్లు తేల్చారు. అతడి సూచనలు, సలహాల మేరకు ఇక్కడ హుస్సేన్ కథ నడిపించినట్లు నిర్ధారించారు. తర్వాత మహిళల నగ్న చిత్రాలను అడ్డం పెట్టుకుని గులామ్ వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు నిర్ధారించారు.

బీదర్ బసవకల్యాణ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్. గుల్బర్గా నివాసి గులామ్ అనే మరో స్నేహితుడి సాయంతో దండా సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం బార్కాస్ ప్రాంతానికి సయ్యద్ హుస్సేన్ వలసొచ్చాడు. ఇక్కడే నకిలీ భూత వైద్యుడిగా అవతారం ఎత్తిన హుస్సేన్.. నిరుపేద మహిళలను టార్గెట్ చేశాడు.

Also Read..Gannavaram Pastor : చనిపోయి మళ్లీ 3 రోజుల్లో బతికి వస్తా, గన్నవరంలో పాస్టర్ వింత చేష్టలు

ఈ క్రమంలోనే ఓ మహిళ.. నారీ నికేతన్ అధ్యక్షురాలు సఫియా మాలిక్ కు తన గోడు వెళ్లబోసుకుంది. సఫియా మాలిక్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారంతా కలిసి పక్కా స్కెచ్ వేశారు. నారీ నికేతన్ కు చెందిన మహిళ, మరో మహిళతో కలిసి సయ్యద్ హుస్సేన్ దగ్గరికి వెళ్లారు. నకిలీ మాంత్రికుడి మాయ మాటలు నమ్మినట్లు నటించారు. వారిని గదిలోకి తీసుకెళ్లగానే.. అప్పటికే మాటు వేసిన పోలీసులు.. సయ్యద్ హుస్సేన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతానికి ఈ కంత్రీ బాబాను ఒక్కడినే అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు