Revanth Reddy : కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు : రేవంత్ రెడ్డి

ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.

Revanth Reddy criticized : కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని తెలిపారు. పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రేవంత్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మీడియాతో మాట్లాడారు.

ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. రూ.100కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పై విచారణ జరిపిస్తున్న మోదీ.. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.

Gidugu Rudra Raju : సోనియాగాంధీని చెడుగా చూపిస్తే బట్టలు ఊడదీసి కొడుతాం.. రాంగోపాల్ వర్మకు గిడుగు రుద్రరాజు వార్నింగ్

శనివారం నడ్డాను, అమిత్ షాను కలిసి వచ్చిన బీజేపీ నాయకులు ఇంకా భ్రమలు పెట్టుకోవద్దన్నారు.
“బీజేపీ, బీఆర్ఎస్ ది మీరు అనుకుంటే తెగిపోయే బంధం కాదు… బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం.. మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరు” అని పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు.

“మీరు ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా మీకు జవాబు రాదు.. తెలంగాణ గల్లీల్లో పర్యటించి కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం.. మీరందరూ కూడా కలిసి రండి” రేవంత్ కోరారు. “మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే” అని రాష్ట్ర బీజేపీ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని విమర్శించారు.

Pawan Kalyan : వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదు : పవన్ కళ్యాణ్

కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్.. దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో బేటీ నేతలు కానున్నారు. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు టీం ఢిల్లీకి వెళ్ళింది. సాయంత్రం 5 గంటలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు