డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల ఢిల్లి నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
గుంటూరులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య-హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలోనూ మస్తాన్ సాయి పేరు వినపడిన విషయం తెలిసిందే. అలాగే, మస్తాన్ సాయి ఫోనులో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది.
పలువురు అమ్మాయిల ప్రయివేటు వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్లో వీడియోలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఏపీ, తెలంగాణకి చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని మస్తాన్ సాయి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
Also Read: విద్యార్థి అనిరుధ్ కుటుంబ సభ్యులకు 50 వేల సాయం చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు