విద్యార్థి అనిరుధ్ కుటుంబ సభ్యులకు 50 వేల సాయం చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు

గత ఎనిమిది నెలల్లో గురుకులాల్లో 36 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు.

KTR

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్‌ క్యాంపులోని గురుకుల పాఠశాలలోఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో అనిరుధ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్.. వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల్లో గురుకులాల్లో 36 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. గురుకుల పాఠశాలలో ఆలనా పాలనా చూసుకునే వారు కరవయ్యారని చెప్పారు.

రాజకీయాలు అవసరంలేదని, బాధిత 36 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వవానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.

సుమారు 500 మంది ఆసుపత్రుల పాలయ్యారని, ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని కేటీఆర్ చెప్పారు. అన్ని పాఠశాలల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలని, ప్రభుత్వమే తల్లిదండ్రిలాగా విద్యార్థుల బాగోగుల బాధ్యతలను తీసుకోవాలని అన్నారు. కాగా, అనిరుధ్ పాముకాటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది.

Also Read: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు?

ట్రెండింగ్ వార్తలు