వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో భారీ స్కామ్

28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది సీఐడీ. హైదరాబాద్ సహా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లో పలు ఆసుపత్రుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

Cm Relief Fund Scam : తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ తో భారీ స్కామ్ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి సర్కార్ సొత్తును కాజేశారు. సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. సీఐడీ విచారణలో నివ్వెరపోయే అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు కాజేసినట్లు తెలిసింది. వైద్యం చేయకపోయినా చేసినట్లు నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వ సొత్తును కొట్టేసినట్లు సీఐడీ గుర్తించింది. దీంతో 28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది సీఐడీ. హైదరాబాద్ సహా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లో పలు ఆసుపత్రుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

 

ట్రెండింగ్ వార్తలు